నందికొట్కూరు న్యూస్ జులై 28( ప్రతినిధి పగడం గోపి)జూపాడుబంగ్లా మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.4,30,114/- లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ ఎమ్మెల్యే గిత్త జయ సూర్య.
👉లబ్ధిదారుల వివరాలు-
(1) తాటిపాడు గ్రామానికి చెందిన కుమ్మరి గీత గారికి రూ.40887/- మరియు (2) తెలుగు వెంకట లక్ష్మమ్మ గారికి రూ.51114/- (3) కనకం ఇందిరా గారికి రూ.20000/-
(4) మండ్లెం గ్రామానికి చెందిన జి రవళి గారికి రూ.20464/- మరియు (5) దేవ నిహారిక గారికి రూ.27574/- (6) తర్తూర్ గ్రామానికి చెందిన బైరుకొండ మల్లికార్జున గారికి రూ.35909/-
(7) 80 బన్నూరు గ్రామానికి చెందిన నాగరత్నమ్మ గారికి రూ.66250/- మరియు (8) లింగస్వామి గారికి రూ. 52350/-
(9)తరిగోపుల గ్రామానికి చెందిన రవి గౌడ్ గారికి రూ. 40205/- మరియు (10) బాలస్వామి గారికి రూ.37983/-
(11) తాటిపాడు గ్రామానికి చెందిన బండారు మల్లిక గారికి రూ.37378/- కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే గిత్త జయసూర్య లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్యం మరియు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అభయాన్ని ఇస్తోంది. బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించి, వారి కుటుంబాల్లో భరోసా నింపడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రజారోగ్య పరిరక్షణకు, పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా మండల పరిధిలోని కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.





