సమాచార హక్కు చట్టం 2005లో ప్రవేశపడి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచింది. రమేష్, రాజ్ నారాయణ్ కేసు, సుప్రీం కోర్టు తీర్పు ప్రాధాన్యం కలిగించాయి.
సమాచార హక్కు చట్టం అనేది భారత ప్రభుత్వంచే 2005లో ప్రవేశపెట్టబడిన ఒక చట్టం, ఇది పౌరులకు ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని పొందే హక్కును ఇస్తుంది. ఇది ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకతను పెంచడానికి, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి మరియు అవినీతిని అరికట్టడానికి సహాయపడుతుంది. ఓటు హక్కు తర్వాత అంతటి ప్రాధాన్యత దీనికే ఉంది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలైన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. సమాచార హక్కు ద్వారా ప్రభుత్వం ప్రజలకోసం ఎంత ఖర్చు పెడుతుంది.
అలాగే ఆఫీసుల్లో పాలన రికార్డుల వివరాలను పొందడానికి ఈ సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందని సమాచార హక్కు అధ్యక్షులు రమేష్ తెలిపారు. వ్యవస్థలో లోపాలను కూడ ఈ చట్టం ద్వారా బహిర్గతం చేయవచ్చును. రాజ్యాంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఆర్టీఐకే దక్కిందన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాల్లో ఇదొకటి కూడా ఉంది. అవినీతి నిర్మూలన, విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించడంతోపాటు పారదర్శకతను పెంపొందించడం, సుపరిపాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి.
