భారతీయ రిజర్వ్ బ్యాంక్ మన రోజువారీ నగదు లావాదేవీల్లో అత్యంత కీలకమైన పాలిమర్ నోట్ల ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. మార్కెట్లో అత్యధికంగా చేతులు మారే రూ. 10, రూ. 20 నోట్లలో సరికొత్త ప్లాస్టిక్ రూపాన్ని ప్రయోగాత్మకంగా తీసుకురాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా అధికారికంగా ప్రకటించింది. సాధారణ కాగితపు నోట్ల స్థానంలో ఎక్కువ కాలం మన్నేలా, త్వరగా చిరిగిపోకుండా ఉండేలా దాదాపు రూ. 3,000 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తేవడమే ఈ వినూత్న ప్రయోగం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
